పవన్ కోసం అదనంగా 20.. తప్పదంటున్న క్రిష్

పవర్ స్టార పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న పవన్, తాజాగా బుధవారం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో సినిమాను ప్రారంభించాడు.

 Pawan Kalyan Krish Movie To Have 20 Crores Sets-TeluguStop.com

ఈ సినిమా పీరియాడికల్ కథను కలిగి ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సెట్స్‌ను భారీ బడ్జెట్‌తో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట చిత్ర యూనిట్.

మొఘల్ బ్యాక్‌డ్రాప్‌తో కథ నడుస్తుండటంతో ఈ సినిమాలో తాజ్ మహల్, చార్మినార్ వంటి కట్టడాల సెట్‌లను ఏర్పాటు చేస్తు్న్నారట చిత్ర యూనిట్.ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ సెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సెట్‌లు చిత్రానికి కీలకంగా మారుతాయిన అంటున్నారు చిత్ర యూనిట్.

క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి.మరి వారిద్దరిలో ఎవరిని కన్ఫమ్ చేస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అంచనాలు ఏర్పడటం సహజం అంటున్నారు సినీ ప్రేమికులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube