పవర్ స్టార పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో ఫ్యాన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న పవన్, తాజాగా బుధవారం దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో సినిమాను ప్రారంభించాడు.
ఈ సినిమా పీరియాడికల్ కథను కలిగి ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో సెట్స్ను భారీ బడ్జెట్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట చిత్ర యూనిట్.
మొఘల్ బ్యాక్డ్రాప్తో కథ నడుస్తుండటంతో ఈ సినిమాలో తాజ్ మహల్, చార్మినార్ వంటి కట్టడాల సెట్లను ఏర్పాటు చేస్తు్న్నారట చిత్ర యూనిట్.ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్తో ఈ సెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సెట్లు చిత్రానికి కీలకంగా మారుతాయిన అంటున్నారు చిత్ర యూనిట్.
క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు వినిపిస్తున్నాయి.మరి వారిద్దరిలో ఎవరిని కన్ఫమ్ చేస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అంచనాలు ఏర్పడటం సహజం అంటున్నారు సినీ ప్రేమికులు.