పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోరుమీదున్నాడు.ఇప్పటికే వరసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పవన్, తన తాజా చిత్రం వకీల్ సాబ్ను రిలీజ్కు రెడీ చేశాడు.
ఇక దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించాడు పవన్.అయితే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువగా అప్డేట్స్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం లేదు.
దీంతో ఈ సినిమా ఎంతవరకు వచ్చిందనే విషయంపై ప్రేక్షకుల్లో క్లారిటీ లేకుండా పోయింది.అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.పీరియాడికల్ మూవీగా ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడట.అయితే ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.కానీ తాజాగా ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే పవర్ఫుల్ టైటిల్ను పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కథకు పర్ఫెక్ట్గా సరిపోయే టైటిల్ కావడంతో ఈ సినిమాకు హరిహర వీరమల్లు టైటిల్ను ఫిక్స్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి పవన్ కోసం క్రిష్ మరో పవర్ఫుల్ టైటిల్ను తెరపైకి తీసుకొచ్చాడని, ఇక ఈ సినిమాలో పవన్ను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడా అని పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ముగించేసి, 2021 చివరినాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాకు ఏ టైటిల్ను ఫిక్స్ చేస్తారో చూడాలి.