పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా షూటింగ్ ఇంకా ఎప్పుడు ఎప్పుడు అంటూ ఏడాది కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
క్రిష్ దర్శకత్వంలో సినిమా కు పవన్ డేట్లు ఇవ్వకుండా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు డేట్లు ఇవ్వడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కోసం సెట్టింగ్ ల నిర్మాణం జరుగుతున్న కారణంగానే ఆ రీమేక్ కు పవన్ డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా 40 వర్కింగ్ డేస్ లోనే ఆ రీమేక్ ను పూర్తి చేసేలా దర్శకుడు సాగర్ చంద్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.మరో రెండు వారాల్లోనే ఆ సినిమా షూటింగ్ నూరు శాతం పూర్తి కాబోతుందట.
అంటే ఈ సినిమా వచ్చే నెలలో అనుకుంటే ముందే అంటే ఈ నెల చివరి వారంలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ మరియు బాలీవుడ్ ముద్దుగుమ్మను ఎంపిక చేయడం జరిగింది.
వీరిద్దరు మార్చి మొదటి వారంలో హైదరాబాద్ కు చేరుకుని క్రిష్ మూవీలో నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.అంటే ఖచ్చితంగా ఈ నెల చివర్లో నే దర్శకుడు క్రిష్ తన తదుపరి సినిమాను పవన్ తో మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఛార్మినార్ సెట్టింగ్ నిర్వాణం లో ఉందట.ఆ సెట్టింగ్ లో పూర్తిగా సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ దొంగ గా కనిపిస్తాడని మొఘలాయిల కాలం నాటి కథతో కాస్త ఛారిత్రాత్మక టచ్ ఇచ్చి కనిపిస్తాడని అంటున్నారు.ఇక ఈ సినిమా ను ఇదే ఏడాదిలో కూడా విడుదల చేస్తామని క్రిష్ అంటున్నాడు.
అంటే పవన్ నటిస్తున్న మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నాయి.అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఈ ఏడాది ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు.ఇది ఖచ్చితంగా అభిమానులకు ఫుల్ హ్యాపీ ప్రకటన అంటున్నారు.