పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.ఇప్పటి వరకు ఏడాదిలో కేవలం ఒక్క సినిమా చేస్తూ వచ్చిన పవర్ స్టార్ ఈ సారి మాత్రం స్పీడ్ పెంచాడు.
ఈ ఏడాదిలో ఏకంగా నాలుగు సినిమా షూటింగ్ లు లైన్ లో పెట్టాడు.వాటిలో సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ఒకటి కాగా, క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ ఒకటి.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి చేశాడు.వెంటనే గ్యాప్ తీసుకోకుండా ఈ రెండు సినిమా షూటింగ్ లు వెంట వెంటనే స్టార్ట్ చేసేశాడు.
కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు సినిమా షూటింగ్ పవన్ చేయబోతున్నాడు.
అయ్యప్పన్ కోషియమ్ ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకొని షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలని సాగర్ చంద్ర షూట్ చేస్తున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ ఇంకా పాల్గోలేదు.ప్రస్తుతం క్రిష్ మూవీకి సంబందించిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.పీరియాడికల్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా మెజారిటీ షూటింగ్ పార్టీ గ్రీన్ మ్యాట్ లోనే జరగనుంది.
అవుట్ డోర్ షెడ్యూల్ చాలా తక్కువగా ప్లాన్ చేశారు.
ఈ నేపధ్యంలో తాజాగా హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కి క్రిష్ స్టార్ట్ చేశాడు.సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ షూట్ లో జాయిన్ అయ్యారు.
ఈ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత పవర్ స్టార్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యి అవుతాడు.రానా కూడా అప్పుడే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇద్దరికి సంబందించిన కీలక సన్నివేశాలని ముందుగా తెరకెక్కించేందుకు ఏకే దర్శకుడు సాగర్ చంద్ర షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.అలా రెండు సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సమన్వయము చేస్తున్నారు.
రెండు సినిమాలు ఇంచుమించు ఒకేసారి రిలీజ్ కి కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.