పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.ఎన్నో అవాంతరాల మధ్య ఎట్టకేలకి ఈ సినిమాకి మోక్షం వచ్చింది.
ఇదిలా ఉంటే ఓ వైపు రాజకీయం, మరో వైపు సినిమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ తన జర్నీ సాగిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం రైతుల సమస్యలపై దీక్షలు చేసిన పవర్ స్టార్ వెంటనే వచ్చి వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేశాడు.
జనవరి కొత్త సంవత్సరంలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.ఇప్పటికే రెండు సినిమాలని షూటింగ్ కి సిద్ధం చేశారు.
సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ సినిమా షూటింగ్ జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరగనుంచి, ఇక క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తుంది.ఒక సినిమాలో కంప్లీట్ మాస్ లుక్ కాగా ఇంకొకటి పూర్తి సేవింగ్ తో నాయకుడుగా కనిపిస్తాడు.
ఈ రెండు సినిమా షూటింగ్ లని ఒకేసారి కొనసాగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన క్రిష్ మూవీ సెట్ లో జాయిన్ కావాలని అనుకుంటున్నారు.
ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది.ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో అప్పటి వాతావరణం ఎలివేట్ అయ్యేవిధంగా ఒక సెట్ ని క్రిష్ వేయించాడు.ఈ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ జనవరి నాలుగు నుంచి క్రిష్ మూవీ లో జాయిన్ కాబోతున్నాడు.క్రిష్ సినిమాకు సంబంధించి ఆ సెట్ లో సన్నివేశాలు పూర్తి చేసిన వెంటనే అయ్యప్పన్ కోషియమ్ షూటింగ్ లో జాయిన్ అవుతారు.
అక్కడ ఒక షెడ్యూల్ పూర్తి చేసి తరువాత క్రిష్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఇలా రెండు సినిమాల షెడ్యూల్స్ వైజ్ గా షూటింగ్ ఒకదాని తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్ కి కన్వీనియంట్ అయ్యే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటుంది.