టాలీవుడ్లో గతకొద్ది రోజులుగా ఓ మలయాళ చిత్ర రీమేక్ గురించి ఎక్కువ చర్చ సాగుతోంది.మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘అయ్యపనుమ్ కొషియుమ్’ అనే సినిమాను తెలుగులో తెరకెక్కించేందుకు పులువురు హీరోలు ఆసక్తగా ఉండటంతో ఈ సినిమాను ఎవరు చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.
అయితే చాలా మంది హీరోల పేర్లు వినిపించినా ఈ సినిమాలో రానా దగ్గుబాటి, రవితేజ హీరోలుగా ఫిక్స్ అయ్యారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
కాగా ఈ సినిమాపై తాజాగా ఓ స్టార్ హీరో మనసుపారేసుకున్నట్లు తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ చూడాల్సిందిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోరాడట.
దీంతో పవన్ ఈ సినిమాను చూడగా, ఆయనకు విపరీతంగా నచ్చేసిందట.
దీంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ను చేయాలని ఆయన భావిస్తున్నాడట.
అయితే పవన్ ఈ సినిమా చేయకపోవడమే బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది.
అలాంటప్పుడు కేవలం స్టార్ హీరో క్రేజ్ కారణంగా ఈ సినిమా కథను మార్చడం బాగుండదని, అందుకే పవన్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయకపోవడమే మంచిదని పలువురు అంటున్నారు.మరి పవన్ ఈ సినిమాను నిజంగానే చేస్తాడా లేక లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్ సంగతి తెలిసిందే.