మెగా డాటర్ నిహారిక ఈరోజు రాత్రి 7 గంటల15 నిమిషాలకు జొన్నలగడ్డ వెంకట చైతన్య తో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ రాజస్థాన్ ఉదయపూర్ కి చేరుకున్నారు.
ఒక పవన్ కళ్యాణ్ మినహా కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలో పాల్గొని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పెళ్లికి హాజరు అవుతారా? లేదా? అన్న విషయంపై మెగా కుటుంబ సభ్యులకు క్లారిటీ లేకుండా పోయింది.పెళ్లికి కొన్ని గంటల ముందు అయినా హాజరవుతారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ నిన్న మధ్యాహ్నం తన పనులు ముగించుకొని ఉదయపూర్ కి చేరుకున్నారు.
మరో రెండు రోజుల పాటు ఉదయపూర్ లోనే పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా డిసెంబర్ 7న అన్ని జిల్లాలలో జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేశారు.
అందుకోసం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయి పెళ్లి వేడుకకు కొద్దిగా ఆలస్యంగా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ పెళ్లికి వస్తారా రారా అన్న అనుమానంతో ఉన్న మెగా కుటుంబ సభ్యులు ఉన్నారు.కానీ పెళ్ళికి ఒకరోజు ముందుగానే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఉదయపూర్ చేరుకున్నారు.పెళ్లికి రావడమే కాకుండా, నిహారికకు బాగా ఖరీదైన బహుమతులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం.
పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ పెళ్లికి హాజరు కాకుండా, తన పిల్లలు అఖీరా, ఆద్య పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు.
ఏది ఏమైనా మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి పెళ్లి హడావిడిలో ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.ఇప్పటికే సంగీత్ కార్యక్రమంలో చిరు పాటలు డాన్సులు వేస్తూ చైతన్య, నిహారిక ఎంతో ఆనందంగా గడిపారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.