మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా అక్టోబర్ 5న అనగా రేపు దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా నయనతార, సత్యదేవ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు.
అందరూ బడా స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత నెలకొన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త తెగచక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మలయాళ సినిమాలో టోవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడట.పవన్ కళ్యాణ్ చేసిన ఆ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవనుంది అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు హైలెట్ టోవినో పొలిటికల్ స్పీచ్ తెలుగులో కూడా పవన్ అలాంటి అదిరిపోయే స్పీచ్ ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆ పాత్ర కోసమే చిరంజీవి ఈ సినిమాను టేక్ ఓవర్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇంకా పవన్ కళ్యాణ్ స్పీచ్ నిజ రాజకీయాలకు కౌంటర్లు ఇచ్చే విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఇదంతా నా అన్న చెప్తేనే నేను చేశాను.
అన్న లేనిదే నేను లేను అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ థియేటర్లో అరుపులు కేకలతో అరాచకం సృష్టిస్తుంది అని అంటున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర 30 నిమిషాల వరకు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే మరి.ఒకవేళ ఇదే వార్త నిజం అయితే మెగా అభిమానులకు ఇదొక ఊహించని బిగ్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.