పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ప్రారంభంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకుని అభిమానులకు బంపర్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి.ఈ సినిమాతో చాలా రోజుల తరువాత పవన్ సాలిడ్ రీఎంట్రీ ఇచ్చాడు.
దీంతో పవన్ తన నెక్ట్స్ మూవీ ‘భీమ్లా నాయక్’ను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పవన్ మరోసారి అదిరిపోయే హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా తరువాత పవన్ వరుసగా తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టాడు.
ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ సిద్ధమయ్యాడు.
కాగా పవన్ ప్రస్తుతం తన చిత్రాల కోసం రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.వకీల్ సాబ్ చిత్రానికి పవన్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే, హరీష్ శంకర్ చిత్రానికి ఆయన ఏకంగా రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అంటే ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ను ఆయన పెంచేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి పవన్ ఫుల్ బిజీగా ఉండటంతో ఆయన రెమ్యునరేషన్ పెంచడం కరెక్ట్ అంటున్నారు ఆయన అభిమానులు.ఇక పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.