అజ్ఞాతవాసి తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరలా వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇందులో భాగంగా ముందుగా దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమా మెజార్టీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
వచ్చే నెలలో తిరిగి లాక్ డౌన్ ఓపెన్ చేయగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి నిర్మాత ఏఎం రత్నం రెడీ అయ్యాడు.
దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు.
అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ సినిమా కాస్త ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ముందుగా అందించిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.అలాగే క్రిష్ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉండడంతో ముందుగా హరీష్ శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లి వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది.