పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలుసు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.
వరుస ప్లాపులతో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ సాధించాడు పవర్ స్టార్.రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఈ మధ్యనే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందు వచ్చాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు వరస పెట్టి సినిమాలు ఒప్పుకుంటూ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయబోతున్నారు.
అంతేకాదు పవన్ ఈ సినిమాతో పాటు రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియం‘ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది.యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.కరోనా తో గ్యాప్ రాకపోయి ఉంటే ఇప్పటుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేవారు.
తాజాగా పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వినిపిస్తుంది.ఈ సినిమా కోసం హరీష్ శంకర్ రాసుకున్న కథతో పవన్ కూడా పలు పంచుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిని బట్టి చుస్తే హరీష్ తో పాటు పవన్ కూడా ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్టు టాక్.మరి చూడాలి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో.