పవన్ ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ ప్రైజ్‌ ఇచ్చిన హరిహర వీరమల్లు నిర్మాత

పవన్ కళ్యాణ్‌ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.మొదటి సారి పవన్‌ కళ్యాణ్ దొంగ పాత్రలో ఒక పౌరాణిక సినిమాను చేస్తున్నాడు.

 Pawan Kalyan Harihara Veeramallu Movie Shooting Update By Producer, Am Ratnam, F-TeluguStop.com

అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయం అనే నమ్మకంతో అంతా ఉన్నారు.

ఈ సమయంలోనే ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం చెప్పడంతో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా ట్రెండ్డింగ్‌ లో నిలిచింది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం పవన్‌ కళ్యాణ్ వెయిట్‌ చేస్తున్నాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఒక ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ.సినిమా 50 శాతం వరకు షూటింగ్‌ పూర్తి అయ్యింది.బాలీవుడ్‌ స్టార్స్ అర్జున్‌ రామ్‌ పాల్ మరియు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ లు త్వరలో షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఏప్రిల్‌ వరకు షూటింగ్‌ జరిపినట్లుగా పేర్కొన్న ఆయన పవన్‌ కు కరోనా రావడం ఆ తర్వాత లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగినట్లుగా పేర్కొన్నాడు.

సినిమా చిత్రీకరణ కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన వెంటనే మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ఈ సినిమా ను క్రిష్‌ అద్బుతం గా చిత్రీకరిస్తున్నట్లుగా కూడా ఆయన అన్నాడు.

పవన్ సినిమా అప్ డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులకు నిర్మాత చెప్పిన ఈ మాటలు చాలా పెద్ద సర్‌ ప్రైజ్ అనడంలో సందేహం లేదు.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవ్వబోతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube