బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన రచయిత విజయేంద్ర ప్రసాద్.ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ తో పాటు హిందీలో మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కబోయే సీత, అలాగే కంగనా నటించబోయే కాశ్మీర్ క్వీన్ మూవీస్ కి కథని అందిస్తున్నాడు.
ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం.ఇదిలా ఉంటే గతంలో విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథని సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఆ కథని పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం రాలేదని క్లారిటీ కూడా ఇచ్చారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే కథని విజయేంద్ర ప్రసాద్ మళ్ళీ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారని, అలాగే స్టార్ దర్శకుడు ఈ సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ కి ఈ కథని చెప్పడం జరిగిందని, ఆయన కూడా ఒకే అన్నారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
వీటిని పూర్తి చేసిన తర్వాతనే నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఈ నేపధ్యంలో విజయేంద్ర ప్రసాద్ కథతో పవన్ కళ్యాణ్ నటించడానికి సమయం పట్టే అవకాశం ఉందని మాట వినిపిస్తుంది.ఇప్పటికే రచయితగా కమర్షియల్ కథలతో తనని తాను ప్రూవ్ చేసుకొని స్టార్ రైటర్ అనిపించుకున్న విజయేంద్ర ప్రసాద్ కథతో పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా అది భారీ హైప్ ని క్రియేట్ చేస్తుంది.