తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాభవాన్ని మూట గట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ మీద ఉన్న పిచ్చి ఇంకా పోలేదు.తనని దారుణంగా ఓడించిన కూడా తన ప్రయాణం ప్రజలతోనే, ప్రజా సమస్యలపై పోరాటంలోనే అంటూ మరో సారి చెప్పుకొచ్చాడు.
గత కొంత కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలు వదిలేసి తన అన్నలాగానే సినిమాలలోకి వెళ్లిపోతాడని, ఇప్పటికే అతనితో సినిమాకి ఓ స్టార్ దర్శకుడు సిద్ధంగా ఉన్నాడని, స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు అంటూ పుకార్లు వినిపించాయి.ఇక ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తాడని కూడా వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉంటే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రయాణం గురించి మరో సారి ఓ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.తాను ఓడిపోయినా కూడా ప్రజలతోనే ఉంటానని, 25 ఏళ్ల రాజకీయ లక్ష్యంతో ప్రజల మధ్యకి వచ్చానని, ఇకపై ప్రజలతోనే, రాజకీయ నాయకుడుగానే ఉంటానని చెప్పాడు.
ఇక తాను మళ్ళీ సినిమాలో నటిస్తాను అనేది అబద్ధం అని, అందులో ఎలాంటి వాస్తవం లేదని, ఇకపై సినిమాలలో నటించే ఆసక్తి కూడా తనకి లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.భవిష్యత్తు అంతా ప్రజా సమస్యలపై పోరాటం కోసం అంకితం చేస్తా అని ఈ సందర్భంగా చెప్పి క్లారిటీ ఇచ్చాడు.
దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలలో మళ్ళీ నటిస్తాడు అనే పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.