పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు.ముందు రెండు సినిమాలను ఒప్పుకున్న పవన్ వాటిని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
అయితే ఆ తర్వాత పవన్ మరొక రెండు సినిమాలను ఒప్పుకుని వాటిని కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు.పవన్ చేస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25న హరిహర వీరమల్లు సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు తారుమారు అయ్యాయి.థర్డ్ వేవ్ నేపథ్యంలో పవన్ షూటింగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో పవన్ షెడ్యూల్ చూసిన అభిమానులు ఈ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుబాటితో కలిసి పవన్ భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
అయితే పవన్ తిరిగి సెట్స్ మీదకు త్వరగా వస్తే బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చెయ్యాలని భావిస్తుండగా.రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలంటే మేకర్స్ భయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకు ఎటువంటి ఆంక్షలు లేవు.
అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల రేటు ఎక్కువుగా ఉండడం.థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.పవన్ కళ్యాణ్ మరోకొద్దీ రోజులు షూటింగులకు బ్రేక్ ఇవ్వాలని.
సెట్స్ లో అడుగు పెట్టకూడదని అనుకుంటున్నాడట.మరి ఇదే కనుక నిజమైతే భీమ్లా నాయక్ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
అలాగే ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.అంతే కాదు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.ఇక అందుకే పవన్ భీమ్లా నాయక్ సినిమాను సమ్మర్ టార్గెట్ గా పెట్టుకోవాలని మేకర్స్ చూస్తున్నారట.
మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.