పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఓ రెండేళ్ళ పాటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేసి మళ్ళీ రాజకీయాలకి ఫుల్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు.
దానికోసం గ్యాప్ లేకుండా షూటింగ్ లు పెట్టుకున్నారు.గతంలో మాదిరి ఏడాది మొత్తం ఒకే సినిమా కాకుండా కేవలం సినిమాకి ఇన్ని కాల్ షీట్స్ అంటూ కేటాయించారు.
ప్రస్తుతం నాలుగు సినిమాలు ఆయన లైన్ లో పెట్టారు.మరికొంత మంది దర్శకులు కూడా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
గతంలో తన సన్నిహితుడు బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ నిర్మాతగా నిలబెట్టాడు.గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అతనికి అందించాడు.
ఇప్పుడు తన ఆప్తుడుగా పవన్ కళ్యాణ్ చెప్పుకునే అలీకి కూడా నిర్మాతగా లైఫ్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
రాజకీయంగా వేరే దారులలో వెళ్ళిన పవన్ కళ్యాణ్, అలీ ఈ మధ్య మళ్ళీ దగ్గరయ్యారు.
ఈ నేపధ్యంలో ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ వైరల్ అయ్యింది.పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు కిషోర్ పార్ధశానిని దర్శకుడుగా నిలబెట్టడానికి అతనితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
గతంలో కిషోర్ తో రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చేశాడు.ఇప్పుడు మరో సినిమాని కూడా చేయాలని అనుకుంటున్నాడు.
దీని కోసం అతను ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఇదే సినిమాతో అలీని బడా నిర్మాతగా మార్చాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే అలీ నిర్మాతగా మారి లో బడ్జెట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.అలాగే వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలీతో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.