గత ఎన్నికలకు కాస్త ముందుగానే జనసేన పార్టీ స్థాపించాడు పవన్కళ్యాణ్.ఆ ఎన్నికల్లో అప్పటి టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాడు.
ఆ ఎన్నికల్లో తాను ఆ రెండు పార్టీలకు ప్రత్యేక హోదాతో పాటు కొన్ని అంశాలను బేస్ చేసుకుని మద్దతు ఇచ్చానని.ఇప్పుడు అవి నెరవేరడం లేదని పవన్ ఈ రెండు పార్టీలపై అసమ్మతి గళం వినిపిస్తున్నాడు.
ప్రత్యేక హోదాతో పాటు ఏపీలో ఉన్న కొన్ని సమస్యలను లేవనెత్తుకుంటోన్న పవన్ వాటిపై ప్రాంతాల వారీగా సభలు పెడుతూ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా నిలదీశే కార్యక్రమానికి తెరలేపాడు
ఇక విశాఖలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి సోషల్ మీడియా ద్వారా తన మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం దీనిని అడ్డుకోవడంతో స్వరం పెంచి ఘాటుగా స్పందించాడు.ఇక పవన్ 2019 ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతుందని…తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉన్నా పవన్ రెండు పడవల ప్రయాణంలో ఎంత వరకు సక్సెస్ అవుతాడనే అంశంపై సవాలక్ష ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి
పవన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.కాటమరాయుడు ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత ఏఎం.రత్నం నిర్మాతగా నీశన్ డైరెక్ట్ చేసే సినిమాల్లో నటించాల్సి ఉంది.ఆ తర్వాత టైం ఉంటే దాసరికి కమిట్ అయిన సినిమా చేయాలి.
త్రివిక్రమ్-నీశన్ సినిమాలు అయ్యే సరికే 2018 సంక్రాంతి వచ్చేస్తుంది.అప్పటకీ ఎన్నికలకు మరో యేడాది మాత్రమే ఉంటుంది
పవన్ ఒక్కసారిగా మీడియాలో స్పందించి చల్లబడిపోతున్నాడు.
ప్రజల్లోకి వెళ్లాలంటే పవన్ చేసే ఈ పోరాటం సరిపోదు.క్షేత్రస్థాయిలో ఇంకా జనసేనకు పునాదులే లేవు.
ఇక ఇటు పాలిటిక్స్, అటు సినిమాలు ఈ రెండిట్లోను పవన్ బ్యాలెన్సింగ్ కూడా సరిగాలేదు.కాటమరాయుడు షెడ్యూల్స్ సైతం లేట్గా జరుగుతున్నాయని తెలుస్తోంది
కాటమరాయుడు జనవరి నెలాఖరుకే పూర్తవుతుందని అనుకున్నా.
ఇప్పుడు ఫిబ్రవరికి కాని పూర్తి కాదని అంటున్నారు.ఇటు రాజకీయంగాను ట్వీట్లు, అప్పడప్పుడు సభలకే పరిమితమవుతున్నాడు.
ఏదేమైనా పవన్ ఈ రెండిట్లోను పాలిటిక్సా.? సినిమాలా .? అన్నది తేల్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది.వచ్చే ఎన్నికలకు ముందు వరకు రెండిట్లోను ప్రయాణం చేస్తానంటూ కుదిరేలా లేదు.
మరి రాజకీయరంగంలోకి వచ్చేసిన పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.