ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి.నాకేమన్నా థియేటర్స్ ఉన్నాయా? నాకేంటి లాభం ? అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకే లేవా ? అని ఆయన ప్రశ్నించారు.ఆ డబ్బులేమన్నా నాకిస్తారా అని పవన్ కళ్యాణ్ మండి పడ్డారు.ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో కూడా సినిమా టికెట్ల విషయం గురించి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విషయాలు అటు రాజకీయ పరంగా ఇటు ఇండస్ట్రీ పరంగా తీవ్ర సంచలనం రేపాయి.
ఇకపోతే తాను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చేసిన సినిమాకి ప్రొడ్యూసర్ తన బావ గారు అల్లు అరవింద్ ఇచ్చింది కేవలం 5 వేల రూపాయలని పవన్ కల్యాణ్ తెలిపారు.“పెద్ద మనసుతో అంత ఇచ్చారు.అంతకంటే ఇంకేం కోరుకుంటాను.
అలాగే జానీ సినిమా ఫ్లాప్ అయిందని ఆ సినిమాకి ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేశాను.దానికి తోడు 15 లక్షలు అప్పు కూడా చేశానని”ఆయన అన్నారు.
టికెట్ రేట్లు పెంచినందుకు కాదు తాను అడిగేది .ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.మీకు ఆ హక్కులేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ఉంటాయి.అలాంటప్పుడు మీ భారతీ సిమెంట్స్ ని అందరికీ ఊరికే పంచొచ్చు కదా… అన్ని లక్ష కోట్లు ఉన్నాయి కదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.