ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించి,మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున రూ.8లక్షల 50వేలు ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు.
ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మండిపడ్డ పవన్ మీ వల్లే వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇస్తూ, అన్నా రాంబాబూ గుర్తుంచుకో నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు.
గ్రామ సమస్యపై రాంబాబుని నిలదీసినందుకు ఆయనను చంపేశారని ఫైర్ అవుతూ, ప్రజాస్వామ్య వ్యవస్దను కూని చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలోని పోలీసు వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని, తప్పుచేసిన మీ ఎమ్మెల్యేను శిక్షించే ధైర్యం కూడా లేదని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.