పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో పవర్ స్టార్ తన రెండేళ్ల గ్యాప్ను పూరించేందుకు సిద్ధమయ్యాడు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ లాయర్గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ సరసన నటించేందుకు చి యూనిట్ లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.అయితే ఈ ఎంపిక విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెద్ద పాత్ర వహించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఎంపికపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఫేడవుట్కు సిద్ధంగా ఉన్న లావణ్య త్రిపాఠీని పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో చేయించడం ఏమిటని వారు మండిపడుతున్నారు.
పవన్ లాంటి స్టా్ర్ హీరో పక్కన స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.మరి దిల్ రాజు నిజంగానే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతాడా లేక హీరోయిన్ను మార్చుకుంటాడా అనేది వేచి చూడాలి.