ఎన్టీయార్ కథానాయకుడు, ఎన్టీయార్ మహానాయకుడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా దర్శకుడు క్రిష్ కు పవన్ కళ్యాణ్ తన సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.మహాశివరాత్రి పండుగ కానుకగా హరిహరవీరమల్లు టైటిల్ తో పవన్ క్రిష్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
చారిత్రాత్మక కథలో క్రిష్ పవన్ ను కొత్తగా చూపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమా బాహుబలి రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్ కెరీర్ లోనే హేయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.టీజర్ లోని భారీతనంను చూసి క్రిష్ విజువల్ వండర్ ను తెరకెక్కించబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
అయితే కొన్నేళ్ల క్రితం క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గౌతమీపుత్రశాతకర్ణి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఆ సినిమాను తక్కువ సమయంలోనే తెరకెక్కించిన క్రిష్ గ్రాఫిక్స్ విషయంలో పొరపాట్లు చేశాడని కామెంట్లు వినిపించాయి.గౌతమీపుత్ర శాతకర్ణి కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే పవన్ సినిమా విషయంలో మాత్రం క్రిష్ ఆ పొరపాట్లు చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.
హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో మరపురాని సినిమాగా మిగలాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మాస్, క్లాస్ ఫ్యాన్స్ మెప్పించే విధంగా క్లైమాక్స్ ఉండాలని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తుండగా నిధి అగర్వాల్ కూడా దొంగగా కనిపించబోతున్నారని సమాచారం.దాదాపు 170 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.