మెగా అభిమానుల గొడవలు రోజురోజుకు పెద్దగవుతున్నాయి.ఇన్నిరోజులు అంతర్గతంగా ఉన్న ఫ్యాన్ వార్, ఇప్పుడు ఒకరిని మీద ఒకరు మాటల దాడి చేస్తూ, బ్యానర్లు కట్టే స్థాయికి చేరుకుంది.
కొన్ని నెలల క్రితం, రామ్ చరణ్ – అల్లు అర్జున్ అభిమానుల మధ్య మొదలైన ఈ తగవులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ – బన్ని ఫ్యాన్స్ మధ్య ఇంకో లెవెల్కు చేరుకున్నాయి.
మొన్నామధ్య సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ అభిమానులంతా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని గోల చేస్తే “చెప్పను బ్రదర్” అంటూ అల్లు అర్జున్ సంచలన వాఖ్య చేసిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి బన్ని అంటే పవన్ అభిమానులకి అదోరకం ద్వేషం.
పవన్ కళ్యాణ్ “శిఖరం” అని, అల్లు అర్జున్ గాలివాటంలో ఏర్పడిన “మట్టిదిబ్బ” అని ( పేరు బయటకి రాయలేదు), మట్టిదిబ్బలు శిఖరం గురించి చెబితే ఏంటి చెప్పకపోతే ఏంటి అని, పవర్ స్టార్ అభిమానులు ఏకంగా ఒక బ్యానర్ కట్టేశారు.
మెగా అభిమానులు ఇలా గొడవపడుతోంటే, ఇదంతా చూస్తూ మహేష్, ఎన్టీఆర్ అభిమానులు టైమ్ పాస్ చేస్తున్నారు.