2018 సంవత్సరంలో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా తరువాత జనసేన పార్టీ కార్యకలాపాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు.
సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాత దిల్ రాజు భావించగా కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా ప్లానింగ్ మొత్తం మారిపోయింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రోజుల క్రితం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం ఫ్యాన్స్ ను అసహనానికి గురి చేస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని సమాచారం.
దసరా పండుగ కానుకగా చిత్రయూనిట్ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.
రేపు దీపావళి పండగ సందర్భంగానైనా ఏదైనా అప్ డేట్ వస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.కానీ వకీల్ సాబ్ యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో నిర్మాత దిల్ రాజుపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.పండుగ సందర్భంగా ఫ్యాన్స్ కు ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
షూటింగ్ దాదాపుగా పూర్తైనా టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడమేమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
వకీల్ సాబ్ యూనిట్ ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.
మరి ఫ్యాన్స్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ఏమైనా అప్ డేట్ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో దీపావళి పండుగకు టీజర్ విడుదల కాకపోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.