పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.సినిమా షూటింగ్ ముగిసింది.
గత ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ ను ఈ ఏడాది లో విడుదల చేయబోతున్నారు.ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు మొన్నటి వరకు భారీగా ఉన్నాయి.
కాని సినిమా గురించి పెద్దగా ప్రచారం చేయని కారణంగా జనాల్లో ఆసక్తి తగ్గిపోతుంది.ప్రస్తుతం పవన్ చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ మరియు క్రిష్ మూవీల గురించే తారా స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను సురేందర్ రెడ్డిల కాంబోలో ఒక సినిమాను కూడా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కనుక ఆ సినిమా ల గురించి కూడా ప్రచారం జరుగుతోంది.
కాని ఇప్పటి వరకు వకీల్ సాబ్ ప్రమోషన్ ను షురు చేయడం లేదు.
మరో అయిదు వారాల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు.
దిల్ రాజు ఈ సినిమా ను నిర్మించాడు.ఇప్పటికే సినిమా దుమ్ము దుమ్ముగా పబ్లిసిటీ చేయాల్సి ఉంది.
కాని ఇప్పటి వరకు ఏం చేయాలో అది చేయడం లేదు.పవన్ మూవీ అంటూ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు ప్రచారం చేయక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారం చేయకుంటే సినిమా సక్సెస్ టాక్ వచ్చిన కలెక్షన్స్ నిరాశ పర్చే అవకాశం ఉంటుంది.అందుకే బయ్యర్లు తాజాగా దిల్ రాజు విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇలా చేయడం ఏంటీ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నాడా అంటూ పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
పవన్ రీ ఎంట్రీ సినిమా అవ్వడంతో ఖచ్చితంగా అంచనాలు ఉన్నాయి.కాని ఆ అంచనాలకు తగ్గట్లుగా ఖచ్చితంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది.