అత్తారింటికి దారేది విడుదల అయ్యి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది, ఇప్పటి వరకూ ఒక్కటి కూడా సోలో సినిమా రాలేదు పవన్ కళ్యాణ్ ది.సర్దార్ గబ్బర్ సింగ్ మీదనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆసలు పెట్టుకుని కూర్చున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి ఒక సూపర్ స్టార్ పెద్ద డైరెక్టర్ లకి ఛాన్స్ లు ఇస్తే ఇండస్ట్రీ హిట్ లు పడతాయి కానీ కళ్యాణ్ మాత్రం డాలీ, బాబీ , దాసరి అంటూ ఫాన్స్ గుండెల్లో భయాలు రేపుతున్నాడు.అనవసరమైన డైరెక్టర్ లకి డేట్ లు ఇచ్చి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో ఒక వర్గం ఆరోపణ.
ఇప్పుడు వారందరినీ భయపెట్టే మరొక న్యూస్ ఏంటంటే .ఖుషీ -కొమరం పులీ సినిమాలు తీసిన ఎస్ జే సూర్య కి పవన్ కళ్యాణ్ డేట్ లు ఇచ్చాడు అని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం పవన్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీస్తున్న శరత్ మరారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడట.రేణు దేశాయ్ నిర్మాత అని ప్రచారం జరిగినప్పటికీ పవన్ మళ్లీ తన మిత్రుడైన శరత్ కే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పవన్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘ఖుషి’ ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.ఐతే తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘పులి’ పెద్ద డిజాస్టరయింది.
అయినప్పటికీ సూర్యను నమ్మి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు పవన్.ఇది ‘ఖుషి’కి సీక్వెల్ అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
అందులో వాస్తవమెంతో త్వరలో రాబోయే అధికారిక ప్రకటనతో తెలుస్తుంది.