“బీమ్లా నాయక్” రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల విషయంలో కఠినంగా వ్యవహరించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో సినిమా సమస్య తప్ప మరే సమస్య లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. “బీమ్లా నాయక్” సినిమాకి ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే రీతిలో ప్రభుత్వం ప్లాన్ లు వేస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో… ఆయన్ని ఎవరు ఏంచేయలేరని చేయలేరు అని స్పష్టం చేశారు.భారతదేశంలో సినిమా రంగం జోలికి వచ్చింది ఎవరూ లేరు అని పేర్కొన్నారు.
సినిమా రంగం పై కక్ష సాధింపులకు ఫుల్ స్టాప్ పెట్టండి అని వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం నాశనం అయిపోయింది ఇప్పటికైనా.మంచి పనులు చేస్తూ ప్రభుత్వం వ్యవహరించాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.
“బీమ్లా నాయక్” సినిమాకి సంబంధించి మరో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మండిపడ్డారు.అందరికీ ఇగో ఉంటుంది.ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించటం దారుణమని ఒకపక్క ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే మరోపక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు.