కరోనాపై పోరాటానికి సెలబ్రిటీలు అందరూ ముందుకొస్తున్నారు.ప్రముఖ వ్యాపారులు ఇప్పటికే తమ పెద్ద మనసు చాటుకున్నారు.
అజీజ్ ప్రేమ జీ ఏకంగా 52 వేల కోట్ల బూరి విరాళం ఇచ్చారు.ఇక అతని దారిలో మిగిలిన వ్యాపార దిగ్గజాలు కూడా ముందుకి వస్తున్నారు.
ఇక చిత్రపరిశ్రమకి చెందిన సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.ప్రకృతి విపత్తుల సమయాలలో సహాయం చేయడానికి ముందుండే పవన్ కళ్యాణ్ మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి తనవంతు మద్దతుగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చాడు.అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటించాడు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై చేస్తున్న పోరాటానికి మద్దతుగా తనవంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
మరి పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ విరాళంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.