పద్మశ్రీ డిమాండ్ చేసిన పవన్.. ఎవరికో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సును కోరుతూ ఆయన ‘చాతుర్మాస్య దీక్ష’ను చేపట్టాడు.

 Pawan Kalyan Demands Padmasri For Kaikala Satyanarayana, Pawan Kalyan, Kaikala S-TeluguStop.com

కాగా లాక్‌డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని, అధికారులను పలుమార్లు డిమాండ్ చేసిన పవన్, తాజాగా పద్మశ్రీ అవార్డును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు.అయితే పద్మశ్రీ అవార్డును పవన్ ఎవరి కోసం డిమాండ్ చేశాడో తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ నవరస నటనా సార్వభౌమగా దశాబ్దాల నుండి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న కైకాల సత్యనారాయణ నేడు 85వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో పవన్ కళ్యాణ్ ఆయనకు తన శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ సందర్భంగా కైకాల తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ అందించారని, ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు గమనించి ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశాడు.

ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్న కైకాల సత్యనారాయణ ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో కనిపించారు.

మరి నవరస నటనా సార్వభౌముడికి పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం ప్రకటిస్తుందో లేదో చూడాలి.తెలుగుస్టాప్.

కామ్ తరఫున ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube