పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇటీవలే వకీల్ సాబ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన విషయం తెల్సిందే.త్వరలో నిహారిక పెళ్లి ఉన్నకారణంగా వకీల్ సాబ్కు వారం గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా పవన్ ఢిల్లీ టూర్కు సిద్దం అయ్యాడు.దాంతో మరోసారి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
వరుసగా సినిమాలు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఇలా బ్రేక్ ల మీద బ్రేక్ లు ఇస్తే సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవ్వాల్సిన అవసరం ఏంటంటూ కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.
దర్శకులు నలుగురు ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు.కాని ఇప్పటి వరకు ఈయన దర్శకులకు డేట్లు ఇచ్చేది ఎప్పుడో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలు మరియు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేయడం వల్ల దర్శక నిర్మాతలు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు అనేది చాలా మంది వాదన.దానికి తోడు ఇంత బిజీగా ఉండే పవన్ ఏకంగా నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు.
అది కూడా తప్పుగా చెబుతున్నారు.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యిందో అందరికి తెల్సిందే.
కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది.అందరు ప్రారంభించిన తర్వాత పవన్ ప్రారంభించాడు.
ఆలస్యంగా ప్రారంభించినా కూడా సరే హడావుడిగా చేస్తున్నాడా అంటే అది కూడా లేదు.ఏమాత్రం హడావుడి లేకుండా చేద్దాంలే అన్నట్లుగా వకీల్సాబ్ను ఇష్టానుసారంగా ఆడుకుంటున్నాడు.
శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి మరియు నివేదా థామస్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా వచ్చే అవకాశం ఉంది.