పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడుగా మంచి క్రేజ్ సంపాదించాడు.
ఇక పవన్ కళ్యాణ్ నుంచి కూడా చాలా గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ హిట్ వచ్చింది.ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా పవన్ కళ్యాణ్ కథ అందించిన సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సినిమాకి కమర్షియల్ హంగులు ఉన్న కథలో అనుకున్న స్థాయిలో దమ్ములేకపోవడంతో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.అయితే గబ్బర్ సింగ్ క్యారెక్టర్ మీద మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇప్పటికి ఆసక్తి తగ్గలేదు.
ఈ నేపధ్యంలో ఆ క్యారెక్టరైజేషన్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్.
గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసిన కిషోర్ పార్ధశాని దర్శకత్వంలో సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలో అతనికి హామీ ఇచ్చాడు.
ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో అతనిని దర్శకుడుగా ప్రోత్సహించేందుకు మరోసారి పవన్ దర్శకుడు డాలీకి ఊతం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా రాజా సర్దార్ గబ్బర్ సింగ్ స్టొరీ లైన్ చెప్పి దాని మీద వర్క్ అవుట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయాలని దర్శకుడు డాలీకి చెప్పినట్లు బోగట్టా.ఇప్పుడు దర్శకుడు కూడా అదే పనిలో ఉన్నాడని, స్క్రిప్ట్ ఫైనల్ అయితే అతనితో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.