గత రెండు రోజులుగా తూర్పు గోదావరిలోని ఏలూరు జిల్లాలోని ప్రజలు ఓ వింతైన వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.ఈ విషయంను నరేంద్ర మోడి దృష్టి కి తీసుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి బిజేపి నాయకులతో జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజేపి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దేవధర్, జాతీయ బీజేపీ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.సతీశ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.ఏలూరులో వ్యాధి తీవ్ర రూపం దాల్చక ముందే కేంద్ర బృందాలను ఇక్కడికి పంపించి దర్యాప్తు జరిపించే దిశగా ప్రయత్నాలు జరపాలని ప్రధాని మోడి గారిని కోరాలని నిర్ణయించారు.ఏలూరు లో అంతు చిక్కని రోగంతో ప్రజలు పడుతున్న బాదను చూసి విచారం వ్యక్తం చేశారు.వైధ్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
నివర్ తుఫాన్ కారణంగ నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని.తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.