ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.టీడీపీ కార్యాలయాలపై మాత్రమే కాక తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై కూడా.
దాడులు.జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా ఘటనలో పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ పార్టీ ఆఫీసు లపై దాడులు పార్టీ ఇళ్లపై దాడులు.
జరగడం ఇదే తొలిసారి వినడం అని.అన్నారు.ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదని పేర్కొన్నారు.
వెంటనే కేంద్ర హోంశాఖ ఈ దాడులపై దృష్టిపెట్టాలని ఏపీ పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని దోషులను వెంటనే పట్టుకోవాలని సూచించారు.
నేతల ఇళ్ల పైన.దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడులు చేయడాని ఖండించారు.దాడులకు పాల్పడిన వారిపై డిజిపి చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇదే రీతిలో స్పందించారు.వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు.