జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ మొత్తం ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మాత్రమే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాడు.వైసీపీకి కంచుకోటగా ఉన్న సీమ జిల్లాలను ప్రధాన టార్గెట్ గా చేసుకున్న పవన్ ఆ ప్రాంతంలోనే జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ జగన్ హవాకు బ్రేకులు వేసేపనిలో పడ్డారు.
ఈ సందర్భంగా పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడమే కాకుండా జగన్ ను ఇరికించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది.మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నాయకులే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఒకవైపు బీజేపీతో సఖ్యత పాటించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు బీజేపీకి ఆగ్రహం తెప్పించేలా మాట్లాడుతూ పవన్ చేస్తున్న రాజకీయం ఎవరికీ అంతుపట్టడంలేదు.
మతం విషయంలో సీఎం జగన్ ను టార్గెట్ చేసుకున్న పవన్ కల్యాణ్, అది పెద్దగా వర్కవుట్ అవుతున్నట్టు కనిపించకపోవడంతో హిందూమతంపై ప్రసంగాన్ని డైవర్ట్ చేస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.అంటే పవన్ ఏదో చేయబోయి ఇంకేదో చేసి మొత్తానికి తానే అభాసుపాలయ్యాడు.పవన్ ఇలా కావాలని చేస్తున్నారా లేక పొరపాటున చేస్తున్నారా అనేది ఎవరికీ అర్థంకావడం లేదు.
చివరికి జనసేన నాయకులకు కూడా పవన్ వ్యాఖ్యలను ఎలా సమర్థించాలో కూడా అర్ధం కావడంలేదు.అయితే, పవన్ చేసిన కామెంట్లు మాత్రం బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
ఆరెస్సెస్, వీహెచ్పీ, బీజేపీ నేతలు వరుసగా పవన్పై విమర్శలదాడి మొదలుపెట్టారు.హిందూధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన పవన్పై, నిరసన వ్యక్తం చేశారు.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పవన్ టార్గెట్ జగన్ అయితే బీజేపీ టార్గెట్ పవన్ అయ్యారు.అసలు పవన్ బీజేపీని టార్గెట్ చేసుకున్నారా లేక వైసీపీని టార్గెట్ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావడంలేదు.పవన్పై వరుసగా బీజేపీ నాయకులు విమర్శలు చేస్తుండటంతో, జనసేన బీజేపీ ల మధ్య వివాదం జరుగుతోంది.
కానీ పవన్ టార్గెట్ మొత్తం జగనేనని, ఆ మాటలు అనే క్రమంలో హిందూ మతాన్ని హిందూ రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారన్న వ్యాఖ్యలు చేసారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించి పవన్ కి ఆగ్రహం తెప్పించారని అందుకే జగన్ ను పవన్ ఇంతగా టార్గెట్ చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే మతపరమైన వ్యాఖ్యలతో జగన్ ను ఇరికించబోయి బీజేపీకి ఆగ్రహం తెప్పించేలా పవన్ ఇరుక్కుపోయారు.