రాజధాని నిర్ణయం వైకాపా వినాశనానికి నాంది

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను నిర్ణయిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెల్సిందే.చట్ట రూపంలో మూడు రాజధానులను తీసుకు రావడంతో పెద్ద ఎత్తున అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు.

 Pawan Kalyan Comments On Ycp Jagan Reddy-TeluguStop.com

గత నెల రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలకు తెలుగు దేశం మరియు జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెల్సిందే.అమరావతి కాకుండా మూడు రాజధానులు అంటూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడంతో జనసేన పార్టీ ఆందోళనలకు సిద్దం అవుతుంది.

నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యలయంలో పవన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున అమరావతి రైతులు చేరుకున్నారు.తమకు మద్దతుగా నిలవాలంటూ కోరుతున్నారు.వారందరితో ప్రస్తుతం పవన్‌ మాట్లాడుతున్నాడు.రాజధాని నిర్ణయం వైకాపా నాశనంకు దారి తీయబోతుంది అంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చరిత్రలో అతి పెద్ద తప్పుగా జగన్‌ భవిష్యత్తులో అనుకోవడం ఖాయం అన్నాడు.రైతులకు మద్దతుగా బీజేపీతో కలిసి ఆందోళనలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా పవన్‌ ప్రకటించాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube