జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించాడు.త్వరలో అక్కడ లోక్ సభ ఉప ఎన్నిక జరగనున్నది.
ఈ నేపథ్యంలో పవన్ అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికలో బిజేపి ,జనసేన నుండి ఎవరు పోటీ చెయ్యబోతున్నాం అనే విషయాన్ని వారం రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నాడు.
కరోనా కారణంగ మేము కలిసి మాట్లాడలేకపోయాం అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమి లేదు.జాతీయ బిజేపి నాయకత్వంపై మాకు బలమైన అవగాహన ఉంది.
జనసేన, బిజేపి పార్టీలు ఏపీ లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని చెప్పడానికి తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకం అన్నాడు.తెలంగాణలోని జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేశామో అదే విదంగా తిరుపతి ఉప ఎన్నికను తీసుకుంటాం అన్నారు జాతీయ స్థాయి బిజేపి నాయకులకు జనసేన పార్టీ అంటే ఏమిటో చూపించాలిసిన సమయం వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికను జనసేన పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది అన్నాడు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో జాతీయ స్థాయి నాయకులు ఎలా ప్రచారంలో పాల్గొన్నారో అలానే తిరుపతి ఉప ఎన్నికలో కూడా బిజేపి జాతీయ నాయకులను దింపాలని రాష్ట్ర బిజేపి నేతలకు పవన్ కళ్యాణ్ సూచించాడు.