తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుని నేటితరం నటీనటులకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలో తన తమ్ముళ్లయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా బ్రదర్ నాగబాబు లను కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి హీరోలుగా పరిచయం చేసాడు.దీంతో మెగాస్టార్ చిరంజీవి బాటలోనే మెగాస్టార్ కుటుంబం నుంచి దాదాపుగా పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
అలాగే నాగబాబు కూతురు “నిహారిక కొణిదెల” హీరోయిన్ గా పరిచయమైంది.కానీ నిహారిక ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.
అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ ఫోటోని ఒకసారి గమనించినట్లైతే అందులో పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు తన అన్న వదిన అయిన మెగా బ్రదర్ నాగబాబు మరియు పద్మజ కొణిదెల అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగినట్లు తెలుస్తోంది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆ మధ్య ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఒకప్పటి ఈ పసివాడే పవర్ స్టార్ గా ఎదిగాడంటూ కామెంట్ చేశాడు.
మరికొంత మంది మెగా అభిమానులు మాత్రం ఒకే ఫ్రేమ్ లో మూడు సింహాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “హరిహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇక మెగాస్టార్ చిరంజీవి తెలుగులో “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు పూజా హెగ్డే లు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటిస్తున్నారు.