సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత అసలు ఏమాత్రం టైం తీసుకోకుండా ఎస్.జె.
సూర్యతో సినిమా స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా నుండి సూర్య ఎగ్సిట్ అవడంతో కాస్త ఢీలా పడ్డాడు.ఇక చేసేదేం లేక ఇదవరకు సినిమా చేస్తానని మాట ఇచ్చిన కారణంగా కిశోర్ పార్థసాని డాలిని రంగంలో దింపాడు.
అతనేమో సినిమాను తన యాంగిల్ లో ప్రయత్నించడానికి కొద్దిరోజులు టైం తీసుకున్నాడు.ఇక అది కూడా అయ్యాక పవన్ బిజీ అయ్యాడు.సో ఇన్ని కారణాల వల్ల సినిమాకు ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవుతునాయని కొంతమంది ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ జారుకున్నారు.
అయితే అంతా సెట్ రైట్ అవుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు పవర్ స్టార్ అసలు కాటమరాయుడా సినిమా కథను కూడా మార్చేస్తున్నాడని రూమర్ వస్తుంది.
అసలైతే ఆకుల శివ రాసిన కథ తెరకెక్కించే ప్లాన్ చేశారు కాని అది సరిగా కుదరకపోవడంతో తమిళ హిట్ సినిమా వీరం నే రీమేక్ చేస్తున్నారని బలమైన టాక్.ఇప్పటికే వేదలం రీమేక్ చేసేందుకు ట్రై చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కూడా రీమేక్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే అది సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ అంటున్నారు.
మరి స్ట్రైట్ సినిమా అని మొదలు పెట్టి రీమేక్ సినిమా చేస్తున్న పవన్ చివరకు తూచ్ ఇది రీమేక్ కాదు పక్కా స్ట్రైట్ సినిమానే అన్నా అంటాడు.మరి ఈ కన్ ఫ్యూజన్ తెర దించాలంటే చిత్రయూనిట్ కు సంబందించిన వారే ఓ క్లారిటీ ఇవాలి.
.