పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ చిత్రాన్ని ‘వకీల్ సాబ్’గా మనముందుకు తీసుకొస్తు్న్నాడు పవన్.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టిన పవర్ స్టార్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
అయితే పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని పవన్-క్రిష్ భావించారట.
కానీ కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్లు వాయిదా పడ్డాయి.అయితే బాహుబలి తరువాత బాలీవుడ్ జనాలను ఏ ఒక్క తెలుగు సినిమా కూడా మెప్పించలేక పోయింది.
ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి, సాహో వంటి సినిమాలు అక్కడ బొక్కబోర్లా పడ్డాయి.
దీంతో బాలీవుడ్ జనాలను మెప్పించడం ఇప్పట్లో జరిగే పని కాదని భావించిన పవన్-క్రిష్, తమ సినిమాను కేవలం సౌత్కే పరిమితం చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ రికార్డులను టచ్ చేయగల సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని, త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి రాజమౌళి మరోసారి బాలీవుడ్కు చుక్కలు చూపెట్టడం మాత్రం ఖాయం.