పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ సాంగ్, ట్రైలర్ విడుదలయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించనున్నారు.
అదే విధంగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి హీరోయిన్ సమస్య పెద్ద కారణంగా మారిపోయింది.
ఈ క్రమంలోనే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా రాణా సరసన నటించడం కోసం మొదట్లో సాయిపల్లవి, ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ చర్చలు అక్కడితో నిలిపివేశారు.
ఈ క్రమంలోనే చిత్రబృందం రానా సరసన నటించడం కోసం ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం రాగా, తాజాగా మలయాళ నటి సంయుక్త మీనన్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చిత్రబృందం ఈమెతో సంప్రదింపులు జరిపారని ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటించేది లేనిది ఆమె కాల్ షీట్ పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.