పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
అయితే ఈ సినిమా కు పోటీగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతుంది.దాంతో సంక్రాంతి పోటీని భీమ్లా నాయక్ ను తప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాధే శ్యామ్ కూడా అదే సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయడం మంచిది కాదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మూడు సినిమాలకు కూడా అది చాలా డ్యామేజీ చేస్తుందని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రాబోతున్నాయి.కనుక వాటికి సంబంధించిన విడుదల తేదీల మార్పులు అనేది కష్టం.
తెలుగు రాష్ట్రాల్లోనే భీమ్లా నాయక్ విడుదల కాబోతుంది కనుక విడుదల వాయిదా వేసినా ఎక్కువ సమస్యలు ఉండక పోవచ్చు అందుకే భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేయించేందుకు గాను దిల్ రాజు మరియు అల్లు అరవింద్ లను దానయ్య మరియు యూవీ క్రియేషన్స్ వారు రాయబారంకు పంపించారనే వార్తలు వస్తున్నాయి.ఆ విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.నిర్మాతలు మరియు బయ్యర్లు అంతా కలిసి భీమ్లా నాయక్ ను వాయిదా వేయించేందుకు ప్రయత్నించారు.కాని నిర్మాత నాగ వంశీ మాత్రం విడుదల వాయిదా వేసే ప్రసక్తే లేదు అన్నట్లుగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదు అన్నట్లుగా ముందుకు దూసుకు పోతున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా భీమ్లా నాయక్ రీ రికార్డింగ్ జరుగుతున్న ఫొటోను షేర్ చేసి సంక్రాంతికి వస్తున్నామంటూ అదే తేదీని మళ్లీ ప్రకటించాడు.ఆయన మళ్లీ మళ్లీ అదే తేదీని ప్రకటిస్తున్నాడు అంటే విడుదల విషయంలో వారు ఖచ్చితంగా బలమైన నిర్ణయంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇటీవల భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేసినట్లుగా వచ్చిన వార్తల నేపథ్యంలో నాగ వంశీ ట్వీట్ కొత్త ట్విస్ట్ ను ఇచ్చినట్లయ్యింది.ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.