పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా అసలైతే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ ల వల్ల వాయిదా పడ్డది.అయితే అనుకోకుండా పాన్ ఇండియా సినిమాలుగా రావాల్సిన ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.
ఆ రెండింటి కోసం భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.ఇక సంక్రాంతికి భీమ్లా నాయక్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు.
సాగర్ చంద్ర డైరక్షన్ లో త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా మాస్ టీజర్ ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలకు భిన్నంగా సినిమా కథ కూడా రివీల్ చేసేలా ఈ సరికొత్త టీజర్ ఉండబోతుందని తెలుస్తుంది.భీమ్లా నాయక్ లో పవన్, రానా నువ్వా నేనా అన్న రేంజ్ లో నటించినట్టు తెలుస్తుంది.
మళయాళం లో సూపర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ గా భీంలా నాయక్ వస్తుంది.