పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈయన రెండు బిగ్ ప్రాజెక్ట్స్ షూటింగ్ లను ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.
పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరొక సినిమా కూడా చేస్తున్నాడు.
యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతుంది.
ఇందులో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంటే రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.
ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగానే పవన్ మరొక సినిమా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.అందుకే ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.ఈ సినిమాపై తాజాగా ఒక క్రేజీ బజ్ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం హరీష్ శంకర్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించే నటుడి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కనిపించ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ విజయ్ సేతుపతి విలన్ అంటే ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.