పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆయన నాలుగు అయిదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా మరో సినిమాను కూడా చేసేందుకు ఓకే చెప్పాడు.ఆ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన బోతున్నాడు.
ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ తన సినిమాకు ఓకే చెప్పారంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ ల కాంబినేషన్ లో వచ్చిన తీన్మార్ మరియు గబ్బర్ సింగ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.కనుక వీరిద్దరి కాంబినేషన్ లో కొత్తగా వచ్చే సినిమా కూడా ఖచ్చితంగా మళ్ళీ సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు మరియు పవన్ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.
వీరిద్దరి కాంబో సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు అంటూ గత రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతుంది.ఆ విషయమై ఒక స్పష్టత వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ కాంబో మూవీకి దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.పూరి గతంలోనే పవన్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేశారట, అది ఇప్పుడు వినిపించడంతో పాటు ఒకే చెప్పించేందుకు రెడీ అవుతున్నారట.
పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.కనుక ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.మరో వైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఇద్దరమ్మాయిలతో సినిమాలు నిర్మించాడు.
ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఈ మొత్తం హిట్ కాంబో అవ్వడం వల్ల ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత అంటే 2022లో ఈ సినిమాను చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.