బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే.పింక్ సినిమా పూర్తిగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మరియు లేడీ ఓరియంటెడ్ సినిమా అనే విషయం తెల్సిందే.
అలాంటి సినిమా ను పవన్ ఎలా చేస్తున్నాడు అంటూ అంతా అనుమానం వ్యక్తం చేసిన సమయంలో పింక్ కథకు కమర్షియల్ టచ్ ఇచ్చి వకీల్ సాబ్ సినిమా ను తెరకెక్కించినట్లుగా విడుదల తర్వాత తేలింది.వకీల్ సాబ్ సినిమా లో ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరీ పెట్టారు.
ఫ్ల్యాష్ బ్యాక్ వల్ల సినిమాకు కమర్షియల్ గా కొత్తదనం వచ్చింది.అలాగే వకీల్ సాబ్ కు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే పేరు పోయింది.
అందుకే వకీల్ సాబ్ ఫార్ములానే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు కూడా వర్తింప జేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను పవన్ మరియు రానా లు కలిసి చేస్తున్న విషయం తెల్సిందే.
పవన్ పాత్రను ఆయన ఇమేజ్ కు తగ్గట్లుగా మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.కథ మరియు స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఇస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో పవన్ పాత్రకు ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన మేకర్స్ చివరి దశ షూటింగ్ కు ప్లాన్ చేశారు.
ఇంతలో కరోనా కారణంగా పవన్ కళ్యాణ్ ఐసోలేషన్ కు వెళ్లి పోయాడు.ఆయన రెండు వారాల్లో పూర్తి ఆరోగ్యంతో ఈ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
ఈ సినిమా ప్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ను ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.