పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్తో రీ ఎంట్రీకి సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.ఆమద్య కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్న పవన్ మళ్లీ రాజకీయాలతో బిజీ అయ్యాడు.
ఆమద్య హస్తిన వెళ్లడంతో పాటు ఏపీలో పలు జిల్లాల్లో రాజకీయ పర్యటనలు చేపట్టాడు.ఇదే సమయంలో పవన్ పింక్ రీమేక్ను పక్కన పెట్టాడా అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ వార్తలను కొట్టి పారేస్తూ మళ్లీ పవన్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు.
నేడు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక కోర్టు సెట్టింగ్లో పవన్ షూటింగ్కు పాల్గొన్నాడు.నల్లకోర్టు వేసుకుని, కాస్త గడ్డంతో పవన్ కనిపించాడు.షూటింగ్లో పవన్ హాజరు అవ్వడంతో అన్నపూర్ణ స్టూడియో ప్రాంతంలో కాస్త హడావుడి కనిపించింది.
పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరడంతో పాటు ప్రముఖ నటీనటులు నేడు షూటింగ్లో పాల్గొన్నారు.నేడు తెల్లవారుజాము నుండే షూటింగ్ను ప్రారంభించినట్లుగా సమాచారం అందుతోంది.
ఏకదాటిగా వారం రోజు షూటింగ్ జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది.దాంతో కోర్టుకు సంబంధించిన సీన్స్ పూర్తి అవుతాయి.ఆ తర్వాత కొన్ని సీన్స్ను పవన్తో పాటు కీలక పాత్రలదారులపై తీస్తే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.వచ్చే నెలలో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.రాజకీయంగా పవన్ ఎలాంటి ఎమర్జెన్సీ పనులు పడకుండా ఉంటే షూటింగ్ను అనుకున్నట్లుగా వచ్చే నెలలో పూర్తి చేసి మే లో సినిమాను విడుదల చేయాలని దిల్రాజు భావిస్తున్నాడు.