పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ చివరి దశ షూటింగ్కు చేరుకుంది.కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ క్రమంలో తన నెక్ట్స్ చిత్రాలను దర్శకుడు క్రిష్, డైరెక్టర్ హరీష్ శంకర్లతో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు పవన్.
కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవల పవన్ బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమాలో పవన్ ఓ లెక్చరర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
విద్యార్ధులకు పాఠాలు నేర్పడమే కాకుండా వారిని సరైన బాటలో పెట్టేందుకు పవన్ తీవ్రంగా కృషి చేసే పాత్రలో కనిపిస్తాడట.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాతో పవన్-హరీష్ శంకర్ కాంబో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ పూజా హెగ్డేను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.