పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా పూర్తి చేయగా అది రిలీజ్ కి రెడీ అవుతుంది.
దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ప్రీలుక్ గతంలోనే హరీష్ శంకర్ రిలీజ్ చేసి తన కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పాడు.
అందులో భగవద్గీతని కూడా పెట్టడంతో ఇదేదో కృష్ణ ఫిలాసఫీ బేస్ చేసుకొని నడిచే కమర్షియల్ స్టొరీ అని అందరూ భావించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తాడని, ఓ ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని టాక్ నడుస్తుంది.యువతలో ఉద్యమ చైతన్యం తీసుకొచ్చే గురువుల పవన్ పాత్రని డిజైన్ చేసినట్లు బోగట్టా.
ప్రస్తుత విద్యావ్యవస్థలో యువత ప్రశ్నించే తత్వాన్ని వదిలేస్తున్నారు.దానిని గుర్తుచేసే విధంగా పవన్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందనే మాట బలంగా ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి లెక్చరర్ గా చేసిన మాస్టర్ సినిమా ఫ్లేవర్ లో కథాంశం ఉంటుందని చెప్పుకుంటున్నారు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.