ఏపీలో జరుగుతున్న కుర్చీలాటలో చివరి అంకం సమీపించింది.అయితే ఈ ఆటలో మూడో ప్రత్యమాయంగా ఉన్న జనసేన పార్టీ ప్రధాన పార్టీలైన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య బొమ్మ బొరుసులా మారింది.
ఎ పార్టీకి అధికారాన్ని దూరం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి రెండు ప్రధాన పార్టీలకి ఉంది.మొన్నటి వరకు బలమైన జనసేనకి బలమైన అభ్యర్ధులు లేరని భావించిన టీడీపీ వైసీపీకి తాజాగా జనసేన ప్రకటిస్తున్న అభ్యర్ధుల జాబితా చూసేసరికి కంటి మీద నిద్ర లేకుండా పోయింది.
ప్రస్తుతం ఆయా నియోజక వర్గాలలో జనసేన ఎంపిక చేసిన అభ్యర్ధులు బలమైన సామాజిక వర్గం కలిగి ఉన్న వారు కావడం, ఓటు బ్యాంకుని భారీగా చీల్చే అవకాశం ఉన్నవారే ఉన్నారు.ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో పార్టీకి జనసేన తన అభ్యర్ధులతో ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసారు.
తాజాగా జనసేన మరో 16 అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది.ఇందులో కొత్తగా పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్, చదలవాడ కృష్ణమూర్తికి తిరుపతి టికెట్ కేటాయించింది.