పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీగా అయ్యప్పన్ కోషియం రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు.
ఓ విధంగా చెప్పాలంటే త్రివిక్రమ్ సారధ్యంలోనే ఏకే రీమేక్ తెరకెక్కుతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది.ఇక పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీలో మరోసారి సందడి చేయబోతున్నాడు.
ఇక లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది.
ఈ సినిమాకి పరశురామకృష్ణమూర్తి అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.హీరోల ఇద్దరి పేర్లని కలిపి ఈ విధంగా పెట్టబోతున్నట్లు సమాచారం.
రెండు భిన్న పార్శాలు ఉన్న హీరోల మధ్య ఇగో క్లాస్ వలన వచ్చిన ఆధిపత్య పోరు నేపధ్యంలో ఈ కథాంశం ఉండబోతుంది.పరశురామ కృష్ణమూర్తి టైటిల్ ని ఫిక్స్ చేయడం జరిగిందని.త్వరలో దీనిని అధికారికంగా ఎనౌన్స్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకే చోట జరగనున్నట్లు తెలుస్తుంది.