పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తర్వాత షూటింగ్స్ కు జాయిన్ అవుతున్నాడు.మొదట పవన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
నిన్నటి నుండి షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది.రానా మరియు పవన్ లు కూడా నిన్న షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు.
కాని చివరి నిమిషంలో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.సినిమాటోగ్రాఫర్ కొన్ని కారణాల వల్ల హాజరు కాలేక పోయాడు.
దాంతో షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.ఒకటి రెండు రోజుల్లో మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న పవన్ కళ్యాణ్ రానాల సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆసక్తితో ఉన్నారు.కనుక ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేకర్స్ రూపొందించే పనిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు.అందుకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యి 50 శాతం వరకు పూర్తి అయ్యింది.మరో వైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా సినిమా ను పట్టాలెక్కించాల్సి ఉంది.
మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇలాంటి సమయంలో ఆయన చకచక షూటింగ్ నిర్వహించాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ రీమేక్ కు బ్రేక్ పడటంతో యూనిట్ సభ్యులు మరియు పవన్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ఈ రీమేక్ ను ఆగస్టులో పూర్తి చేసి వెంటనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.ఈ ఏడాది చివరి వరకు క్రిష్ ఆ సినిమాను పూర్తి చేసేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారని అంటున్నారు.
పవన్ షూటింగ్ కు బ్రేక్ రావడంతో ఆయన కు మరింత విశ్రాంతి లభించినట్లయ్యింది.కరోనా నుండి పవన్ కోలుకున్న విషయం తెల్సిందే.